20 గంటల పాటు నాన్స్టాప్ విమాన ప్రయాణం..
- April 26, 2018
సింగపూర్ ఎయిర్లైన్స్ కొత్త ఎయిర్బస్ ను త్వరలో ప్రారంభించనుంది. దీంతో 20 గంటల పాటు నాన్స్టాప్గా విమానంలో ప్రయాణం చేసే అవకాశం కలగనుంది. ఇప్పటి వరకు ఏ ఇతర విమాన సంస్థ కూడా ఇన్ని గంటల పాటు ఆకాశంలో ప్రయాణించే సౌకర్యాన్ని కలిగించలేదు.
సింగపూర్ విమానయాన సంస్థ ప్రారంభించే కొత్త ఎయిర్బస్ 20 గంటల్లో 11,160 మైళ్ల దూరం ప్రయాణించ గలదు. ప్రస్తుతం ఈ విమానం టెస్ట్ రైడ్ పూర్తిచేసుకుంది.
సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణించే ఎ 350- 900 యూఎల్ఆర్ విమానం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుంది.
9,500 మైళ్ల దూరం గల ఈ రూట్లో గతంలో ఉన్న విమానాన్ని 2013లో రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రస్తుతం మరింత వేగవంతంగా ప్రయాణించే ఎయిర్బస్సులను ప్రవేశపెట్టేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థ సిద్ధమయింది.
కొత్తగా రూపొందించిన ఎయిర్బస్ లలో క్యాబిన్ల క్వాలిటీ పై అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. లాంగ్ ట్యూబ్ మాదిరిగా కాకుండా ఒక రూమ్ మాదిరిగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం కాంటాస్ సంస్థ ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే ఎయిర్ బస్ను కలిగిఉంది. పెర్త్ నుంచి లండన్ వరకు గల దూరాన్ని 17 గంటల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటోంది.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







