20 గంటల పాటు నాన్స్టాప్ విమాన ప్రయాణం..
- April 26, 2018సింగపూర్ ఎయిర్లైన్స్ కొత్త ఎయిర్బస్ ను త్వరలో ప్రారంభించనుంది. దీంతో 20 గంటల పాటు నాన్స్టాప్గా విమానంలో ప్రయాణం చేసే అవకాశం కలగనుంది. ఇప్పటి వరకు ఏ ఇతర విమాన సంస్థ కూడా ఇన్ని గంటల పాటు ఆకాశంలో ప్రయాణించే సౌకర్యాన్ని కలిగించలేదు.
సింగపూర్ విమానయాన సంస్థ ప్రారంభించే కొత్త ఎయిర్బస్ 20 గంటల్లో 11,160 మైళ్ల దూరం ప్రయాణించ గలదు. ప్రస్తుతం ఈ విమానం టెస్ట్ రైడ్ పూర్తిచేసుకుంది.
సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణించే ఎ 350- 900 యూఎల్ఆర్ విమానం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుంది.
9,500 మైళ్ల దూరం గల ఈ రూట్లో గతంలో ఉన్న విమానాన్ని 2013లో రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రస్తుతం మరింత వేగవంతంగా ప్రయాణించే ఎయిర్బస్సులను ప్రవేశపెట్టేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థ సిద్ధమయింది.
కొత్తగా రూపొందించిన ఎయిర్బస్ లలో క్యాబిన్ల క్వాలిటీ పై అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. లాంగ్ ట్యూబ్ మాదిరిగా కాకుండా ఒక రూమ్ మాదిరిగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం కాంటాస్ సంస్థ ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే ఎయిర్ బస్ను కలిగిఉంది. పెర్త్ నుంచి లండన్ వరకు గల దూరాన్ని 17 గంటల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటోంది.
తాజా వార్తలు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు