20 గంటల పాటు నాన్స్టాప్ విమాన ప్రయాణం..
- April 26, 2018
సింగపూర్ ఎయిర్లైన్స్ కొత్త ఎయిర్బస్ ను త్వరలో ప్రారంభించనుంది. దీంతో 20 గంటల పాటు నాన్స్టాప్గా విమానంలో ప్రయాణం చేసే అవకాశం కలగనుంది. ఇప్పటి వరకు ఏ ఇతర విమాన సంస్థ కూడా ఇన్ని గంటల పాటు ఆకాశంలో ప్రయాణించే సౌకర్యాన్ని కలిగించలేదు.
సింగపూర్ విమానయాన సంస్థ ప్రారంభించే కొత్త ఎయిర్బస్ 20 గంటల్లో 11,160 మైళ్ల దూరం ప్రయాణించ గలదు. ప్రస్తుతం ఈ విమానం టెస్ట్ రైడ్ పూర్తిచేసుకుంది.
సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకు ప్రయాణించే ఎ 350- 900 యూఎల్ఆర్ విమానం ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుంది.
9,500 మైళ్ల దూరం గల ఈ రూట్లో గతంలో ఉన్న విమానాన్ని 2013లో రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రస్తుతం మరింత వేగవంతంగా ప్రయాణించే ఎయిర్బస్సులను ప్రవేశపెట్టేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్ సంస్థ సిద్ధమయింది.
కొత్తగా రూపొందించిన ఎయిర్బస్ లలో క్యాబిన్ల క్వాలిటీ పై అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. లాంగ్ ట్యూబ్ మాదిరిగా కాకుండా ఒక రూమ్ మాదిరిగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం కాంటాస్ సంస్థ ప్రపంచంలో అత్యంత దూరం ప్రయాణించే ఎయిర్ బస్ను కలిగిఉంది. పెర్త్ నుంచి లండన్ వరకు గల దూరాన్ని 17 గంటల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుకుంటోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!







