హమస్ పోస్ట్పై ఇజ్రాయిల్ క్షిపణుల దాడి
- April 28, 2018ఇజ్రాయిల్ సైన్యం హమస్ పోస్ట్పై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ గాజా నగరంలో జాలర్ల హార్బర్కు సమీపంలో గల హమస్ స్థావరంపై జరిగిన ఈ దాడిలో భవనం, రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇజ్రాయిల్ సైన్యం కూడా వెంటనే స్పందించలేదు. మార్చి 30వ తేది నుండి ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గాజా నగరంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తూర్పు గాజాలో శుక్రవారం వందలాదిమంది పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 800మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ONGC లో ఉద్యోగాలు..
- ఇటలీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ..
- తెలంగాణ వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి
- కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్
- త్వరలోనే అందరినీ కలుస్తా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
- కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు..
- మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
- ప్రయాణికులు షాక్..300 శాతం పెరిగిన విమానయాన ఛార్జీలు..!
- 49 మంది కార్మికులు మృతి..ఘటనపై అగ్రనేతలు సంతాపం
- రీఛార్జ్ మోసాలపై ఎటిసలాట్ హెచ్చరిక జారీ