అక్రమంగా బెల్ట్లో బంగారం రవాణా
April 28, 2018
బంగారం అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఓ వ్యక్తి ధరించిన నడుం బెల్ట్లో ఐదు బంగారు బిస్కెట్లను గుర్తించారు. 400 గ్రాములున్న ఈ బంగారం విలువ సుమారు రూ. 12 లక్షలుగా సమాచారం. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.