కేంద్ర సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్
- June 13, 2024
న్యూ ఢిల్లీ: టీడీపీ గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్డీయే ప్రభుత్వంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పెమ్మసానికి అవకాశం రాగా.. నేడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెమ్మసాని సోషల్ మీడియాలో స్పందించారు.
“ఢిల్లీలోని సంచార్ భవన్ లో కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. మహోన్నత భారతదేశ ప్రజలకు సేవ చేసే ఈ విశిష్ట అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో అనుభవశీలి, విషయ పరిజ్ఞానం ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ (గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి), జ్యోతిరాదిత్య సింథియా (కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ) గారి మార్గదర్శకత్వంలో పనిచేయనుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పనిచేస్తానని, నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నేతలు గర్వపడేలా పనిచేస్తానని హామీ ఇస్తున్నా” అంటూ పెమ్మసాని వివరించారు.
తాజా వార్తలు
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం







