గౌహతిలో జంట పేలుళ్లు
- December 05, 2015
గౌహతిలో జంట పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక ఫ్యాన్సీ బజార్ లో శనివారం మధ్యాహ్నాం ఈ ఘటన చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉందని, ఎలాంటి భయం అక్కర్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇది తీవ్రవాదుల చర్యా ? లేక ఇతరులెవరైనా చేశారా ? అనేది తెలియరాలేదు. ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు.. దేశ రాజధానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడవచ్చని ఎఫ్ఐఆర్ నమోదైంది. 1వ తేదీన ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడ్డారని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. పారిస్ ఘటన తరువాత ఉగ్రవాద కార్యాకలాపాలు విస్తరించే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ భావించింది. దేశంలో ఎవరైనా ఎంటర్ అయ్యారా ? అని ఇంటిలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనితో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులు దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







