గౌహతిలో జంట పేలుళ్లు
- December 05, 2015
గౌహతిలో జంట పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానిక ఫ్యాన్సీ బజార్ లో శనివారం మధ్యాహ్నాం ఈ ఘటన చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత తక్కువగా ఉందని, ఎలాంటి భయం అక్కర్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఇది తీవ్రవాదుల చర్యా ? లేక ఇతరులెవరైనా చేశారా ? అనేది తెలియరాలేదు. ఢిల్లీకి ఉగ్రవాద ముప్పు.. దేశ రాజధానికి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడవచ్చని ఎఫ్ఐఆర్ నమోదైంది. 1వ తేదీన ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో చొరబడ్డారని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది. పారిస్ ఘటన తరువాత ఉగ్రవాద కార్యాకలాపాలు విస్తరించే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ భావించింది. దేశంలో ఎవరైనా ఎంటర్ అయ్యారా ? అని ఇంటిలిజెన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. దీనితో దేశంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దులు దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







