గాలివానకు అల్లకల్లోలమైన ఏ.పి
- May 01, 2018అమరావతి:ఈదురు గాలులు, అకాలవర్షంతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమయ్యింది. కోస్తాంధ్ర జిల్లాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ, అమరావతి, గుంటూరుల్లో అయితే.. సాయంత్రం నాలుగింటికే చీకట్లు కమ్ముకున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడడంతో జనం భయాందోళనకు గురయ్యారు.
అమరావతి సచివాలయ ప్రాంతంలో సాయంత్రమే చీకటైపోయింది. దట్టమైన మేఘాలు ఒక్కసారిగా కమ్మేయడంతో.. అమరావతి ప్రాంతమంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో సచివాలయం దగ్గర ఉన్న వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గుంటూరులోనూ ఇదే పరిస్థితి. ఉరుముల శబ్దాలతో నగరమంతా హోరెత్తిపోయింది. పిడుగులు పడుతుండడంతో జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈదురు గాలులు, వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడంతో.. గుంటూరు అంతా చీకటిమయం అయ్యింది.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు పెదవేగి మండలంలో తాటి చెట్టు విరిగిపడింది. రోడ్డుపై వెళ్తున్న బైక్పై పడడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జంగారెడ్డి గూడెంలో మామిడి, జీడిమామిడి తోటలతో పాటు, పొగాకు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు ఉధృతంగా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళంలోనూ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. విశాఖలో మధ్యాహ్నానికి వర్షం తగ్గడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం