హైదరాబాద్ లో తనిఖీలతో నరకం చూపిస్తున్న పోలీసులు....
- May 02, 2018హైదరాబాద్:వేళాపాలా లేని డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నాయి. అసలే ఇరుకు రోడ్లు.. ఆపై పీక్ ట్రాఫిక్ టైం. ఈ సమయంలో రోజూ డ్రంకెన్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకు వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్లే.. నిత్యం వాహనదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడే మెట్రో స్టేషన్ ను ఏర్పాటు చేయడంతో రోడ్డు మరీ చిన్నదిగా మారిపోయింది. పోలీసులు బారికేడ్లు పెట్టి.. తనిఖీలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రోజూ ఇక్కడ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 9 గంటల తరువాత నిర్వహించాలని కోరుతున్నారు.అయితే పోలీసులు మాత్రం తమ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్