దీక్ష విరమణ.

- May 07, 2015 , by Maagulf
దీక్ష విరమణ.

   ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగురోజులుగా ఆమరణ దీక్ష చేసిన సినీనటుడు శివాజీ , ఎట్టకేలకు తన ఆందోళనను విరమించుకున్నారు. గుంటూరు ఆసుపత్రి నుంచి గతరాత్రి డిశ్చార్చి అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీకి చెందిన నాయకులు స్పందించిన తీరు పట్ల సంతృప్తి చెందినట్టు చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయమై కేంద్రంతో చర్చిస్తానని చెప్పడంతో శివాజీ దీక్ష విరమణకు కారణమైంది. తన దీక్షకు మద్దతు ఇచ్చినవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన లక్ష్యం నెరవేరుతుందన్న విశ్వాసాన్ని శివాజీ వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com