లెబనాన్లో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు
- May 07, 2018
బీరూట్: తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం లెబనాన్లో ఆదివారం తొలిసారిగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో దేశ ప్రజలు తమకు మెరుగైన భవిష్యత్తు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు అద్యక్షుడు మైకేల్ ఓన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది వారి 'పవిత్ర కర్తవ్యమ'ని అన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రభుత్వంలో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా యువత చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో దేశ పరిస్థితిలో పెను మార్పులు రాగలవని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో విద్యను ముగించుకుని జీవన ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న యువత తమకు ఉద్యోగావకాశాలు కావాలని, మరింత ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటోంది. ఆదివారం నాటి ఎన్నికల్లో 976 మంది అభ్యర్థుల భవితను నిర్ణయించేందుకు దాదాపు 37 లక్షల మందికి పైగా ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..