లెబనాన్లో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు
- May 07, 2018
బీరూట్: తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం లెబనాన్లో ఆదివారం తొలిసారిగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో దేశ ప్రజలు తమకు మెరుగైన భవిష్యత్తు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు అద్యక్షుడు మైకేల్ ఓన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది వారి 'పవిత్ర కర్తవ్యమ'ని అన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రభుత్వంలో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా యువత చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో దేశ పరిస్థితిలో పెను మార్పులు రాగలవని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో విద్యను ముగించుకుని జీవన ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న యువత తమకు ఉద్యోగావకాశాలు కావాలని, మరింత ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటోంది. ఆదివారం నాటి ఎన్నికల్లో 976 మంది అభ్యర్థుల భవితను నిర్ణయించేందుకు దాదాపు 37 లక్షల మందికి పైగా ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!









