లెబనాన్లో ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు
- May 07, 2018
బీరూట్: తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం లెబనాన్లో ఆదివారం తొలిసారిగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో దేశ ప్రజలు తమకు మెరుగైన భవిష్యత్తు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఓటింగ్ ప్రారంభానికి ముందు అద్యక్షుడు మైకేల్ ఓన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది వారి 'పవిత్ర కర్తవ్యమ'ని అన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా రానున్న నాలుగేళ్ల కాలానికి ప్రభుత్వంలో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారని ఆయన వివరించారు. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు 8 లక్షల మందికి పైగా యువత చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో దేశ పరిస్థితిలో పెను మార్పులు రాగలవని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో విద్యను ముగించుకుని జీవన ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్న యువత తమకు ఉద్యోగావకాశాలు కావాలని, మరింత ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకుంటోంది. ఆదివారం నాటి ఎన్నికల్లో 976 మంది అభ్యర్థుల భవితను నిర్ణయించేందుకు దాదాపు 37 లక్షల మందికి పైగా ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







