హెచ్చరిక : ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు, భారీ వర్షం పడే అవకాశం..
- May 11, 2018
ఒడిశా రాష్ట్రంలో నెలకొన్న ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాను ఆవరించింది.. దీంతో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలోని ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ముందస్తు హెచ్చరిక జారీచేసింది ఐఎండీ.. దీంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలు ఎక్కడం, ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండటం. ఎత్తైన చెట్లను ఆనుకుని ఉండటం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేయడం వలన పిడుగు ఆ ప్రదేశాలను ఎక్కువగా ఆకర్షిస్తోందని దానివలన ప్రమాదం జరగవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







