హెచ్చరిక : ఏపీలోని ఈ ప్రాంతాల్లో పిడుగులు, భారీ వర్షం పడే అవకాశం..
- May 11, 2018
ఒడిశా రాష్ట్రంలో నెలకొన్న ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాను ఆవరించింది.. దీంతో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాలోని ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ముందస్తు హెచ్చరిక జారీచేసింది ఐఎండీ.. దీంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాలు ఎక్కడం, ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండటం. ఎత్తైన చెట్లను ఆనుకుని ఉండటం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేయడం వలన పిడుగు ఆ ప్రదేశాలను ఎక్కువగా ఆకర్షిస్తోందని దానివలన ప్రమాదం జరగవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









