రమదాన్: మవసలాత్ టిక్కెట్ దరల తగ్గింపు
- May 14, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, పవిత్ర రమదాన్ మాసం సంద్భంగా టిక్కెట్ ధరల్ని తగ్గించింది. ఈ తగ్గింపు 20 శాతం వరకూ వుంది. క్యాపిటల్ పరిధిలోని టిక్కెట్ ధరలపై మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మస్కట్ వెలుపల మాత్రమే ఈ తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. మస్కట్ పరిధిలో ఉదయం 6.30 నిమిషాల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 15 నుంచి 20 నిమిషాల వరకు బస్ సర్వీసులు అందుబాటులో వుంటాయి. షిప్పింగ్ సర్వీసులకు సైతం ఈ 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని మవసలాత్ పేర్కొంది. రమదాన్ నేపథ్యంలో వర్కింగ్ అవర్స్ మారిన దరిమిలా మస్కట్ - బార్కా, మస్కట్ - సమైల్, మస్కట్ - రుస్తాక్లలో ట్రిప్స్ సంఖ్యను మార్చగా, మిగతా రూట్లలో ఎలాంటి మార్పూ లేదని మవసలాత్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







