రమదాన్: మవసలాత్ టిక్కెట్ దరల తగ్గింపు
- May 14, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, పవిత్ర రమదాన్ మాసం సంద్భంగా టిక్కెట్ ధరల్ని తగ్గించింది. ఈ తగ్గింపు 20 శాతం వరకూ వుంది. క్యాపిటల్ పరిధిలోని టిక్కెట్ ధరలపై మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మస్కట్ వెలుపల మాత్రమే ఈ తగ్గింపు ధరలు అమల్లో వుంటాయి. మస్కట్ పరిధిలో ఉదయం 6.30 నిమిషాల నుంచి అర్థరాత్రి వరకు ప్రతి 15 నుంచి 20 నిమిషాల వరకు బస్ సర్వీసులు అందుబాటులో వుంటాయి. షిప్పింగ్ సర్వీసులకు సైతం ఈ 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని మవసలాత్ పేర్కొంది. రమదాన్ నేపథ్యంలో వర్కింగ్ అవర్స్ మారిన దరిమిలా మస్కట్ - బార్కా, మస్కట్ - సమైల్, మస్కట్ - రుస్తాక్లలో ట్రిప్స్ సంఖ్యను మార్చగా, మిగతా రూట్లలో ఎలాంటి మార్పూ లేదని మవసలాత్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!







