టీటీడీ 'శుభప్రదం'కు దరఖాస్తుల స్వీకరణ
- May 15, 2018
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో 7, 8, 9 తరగతుల విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించే శుభప్రదం కార్యక్రమానికి దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తారు. 'శుభప్రదం' శిక్షణ శిబిరంలో మానవీయ విలువలు, నైతికాంశాలు, వ్యక్తిత్వ వికాసం, సనాతన ధార్మిక విషయాలు, యోగా, ధ్యానంతోపాటు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. దరఖాస్తులు జిల్లాల్లోని హిందూ ధర్మ పరిషత్తు కార్యక్రమ అసిస్టెంట్లు, జిల్లా కేంద్ర కళ్యాణ మండపాల్లో లభిస్తాయని, టీటీడీ వెబ్సైట్ http://www.tirumala.org లో కూడా దరఖాస్తులు పొందవచ్చని ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎంపికైన విద్యార్థులు తిరుపతిలో తమకు కేటాయించిన కళాశాలల్లో ఈ నెల 25న పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. తరగతులను ఈ నెల 26 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వివరాలకు 9030850336, 9849386124లో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







