ఇండియన్ సోషల్ క్లబ్: 3,000 బిర్యానీలు
- May 22, 2018
మస్కట్: 3,000 ప్లేట్ల హైద్రాబాదీ బిర్యానీని రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్కి అందించనున్నారు. ఇండియన్ సోషల్ క్లబ్కి చెందిన దక్కని వింగ్, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఇఫ్తార్ మీల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. మే 25న క్లాక్ టవర్ - సిబిడి వద్ద ఈ బిర్యానీ పంపకం వుంటుంది. 2002 నుంచి రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ని అందిస్తూ వస్తోంది ఇండియన్ సోషల్ క్లబ్తో కలిసి హైదరాబాదీ కమ్యూనిటీ. ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా తమవంతుగా ఇఫ్తార్ మీల్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, ఇదొక దైవ కార్యంగా భావిస్తున్నామనీ, మానవీయ కోణంలో ఇఫ్తార్ మీల్స్ ఏర్పాటు చేస్తుండడం ఆనందంగా వుందనీ నిర్వాహకులు తెలిపారు. మస్కట్లోని పలు రెస్టారెంట్లనుంచి బిర్యానీని సేకరిస్తున్నారు. హైద్రాబాదీ బిర్యానీ ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పేదేముంది? ఒమన్లో భారత బ్రాండ్ అంబాసిడర్ ఇంద్రా మణి పాండే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









