ట్రాఫిక్ కెమెరాలు చూస్తున్నాయ్ జాగ్రత్త
- December 07, 2015
వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మొబైల్ ఫోన్ని వినియోగించినా దుబాయ్లో ట్రాఫిక్ కెమెరాలు పసిగట్టేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలను దుబాయ్లో ఇన్స్టాల్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతధికారులు వెల్లడించారు. గడచిన 11 నెలల్లో సుమారు51,891 కేసుల్ని గుర్తించామనీ, వీటిల్లో సీట్ బెల్ట్, మొబైల్ ఫోన్ అఫెన్సెస్ ఉన్నాయని కల్నల్ సైఫ్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఇల్లీగల్ ఓవర్టేకింగ్,రాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్నీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తించామని ఆయన అన్నారు. వాహనం ఎంత వేగంతో వెళ్ళినా,పసిగట్టగలిగే విధంగా కొత్త టెక్నాలజీతో కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనదారులు కెమెరాలను గుర్తించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. షేక్ జాయెద్ రోడ్లో 51 అధునాతన కెమెరాలను అమర్చగా, ప్రధాన కూడళ్ళ వద్ద 31కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!
- భారత్–బహ్రెయిన్ భాగస్వామ్యం మరింత బలోపేతం..!!
- జలీబ్ అల్ షుయూఖ్లో 315 ఉల్లంఘనలు నమోదు..!!
- ఖతార్లో 7,144 నిరుపయోగ వాహనాల తొలగింపు..!!
- ఒమన్లో ప్రవాస ఉద్యోగులకు కొత్త నిబంధన..!!
- దుబాయ్ కార్మికులకు ఉచిత ఐస్క్రీమ్ పంపిణీకి యూఏఈ నివాసితులకు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం
- పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.. జండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
- ఇరాన్ పై అమెరికా ముమ్మర దాడులు–వంతెనల ధ్వంసం, ఏడుగురు మృతి
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!







