ట్రాఫిక్ కెమెరాలు చూస్తున్నాయ్ జాగ్రత్త
- December 07, 2015
వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మొబైల్ ఫోన్ని వినియోగించినా దుబాయ్లో ట్రాఫిక్ కెమెరాలు పసిగట్టేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలను దుబాయ్లో ఇన్స్టాల్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతధికారులు వెల్లడించారు. గడచిన 11 నెలల్లో సుమారు51,891 కేసుల్ని గుర్తించామనీ, వీటిల్లో సీట్ బెల్ట్, మొబైల్ ఫోన్ అఫెన్సెస్ ఉన్నాయని కల్నల్ సైఫ్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఇల్లీగల్ ఓవర్టేకింగ్,రాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్నీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తించామని ఆయన అన్నారు. వాహనం ఎంత వేగంతో వెళ్ళినా,పసిగట్టగలిగే విధంగా కొత్త టెక్నాలజీతో కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనదారులు కెమెరాలను గుర్తించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. షేక్ జాయెద్ రోడ్లో 51 అధునాతన కెమెరాలను అమర్చగా, ప్రధాన కూడళ్ళ వద్ద 31కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







