ట్రాఫిక్ కెమెరాలు చూస్తున్నాయ్ జాగ్రత్త
- December 07, 2015
వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, మొబైల్ ఫోన్ని వినియోగించినా దుబాయ్లో ట్రాఫిక్ కెమెరాలు పసిగట్టేస్తాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలను దుబాయ్లో ఇన్స్టాల్ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతధికారులు వెల్లడించారు. గడచిన 11 నెలల్లో సుమారు51,891 కేసుల్ని గుర్తించామనీ, వీటిల్లో సీట్ బెల్ట్, మొబైల్ ఫోన్ అఫెన్సెస్ ఉన్నాయని కల్నల్ సైఫ్ అల్ మజ్రోయ్ చెప్పారు. ఇల్లీగల్ ఓవర్టేకింగ్,రాష్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనల్నీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తించామని ఆయన అన్నారు. వాహనం ఎంత వేగంతో వెళ్ళినా,పసిగట్టగలిగే విధంగా కొత్త టెక్నాలజీతో కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. వాహనదారులు కెమెరాలను గుర్తించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. షేక్ జాయెద్ రోడ్లో 51 అధునాతన కెమెరాలను అమర్చగా, ప్రధాన కూడళ్ళ వద్ద 31కెమెరాలను అమర్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









