నిపాపై హెల్త్‌ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్‌

- May 30, 2018 , by Maagulf
నిపాపై హెల్త్‌ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్‌

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, తమ పౌరులు అలాగే నివాసితులకు నిపా వైరస్‌పై హెల్త్‌ అడ్వయిజరీ జారీ చేసింది. ఒమన్‌ నుంచి ఇండియాలోని నిపా వైరస్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఫ్రూట్‌ బ్యాట్స్‌ ద్వారా (పండ్లను ఆహారంగా తీసుకునే గబ్బిలాల ద్వారా) నిపా వైరస్‌ వ్యాపిస్తుంది. సాధారణ ఫ్లూ జ్వరంలో కన్పించే లక్షణాలే ఎక్కువగా ఈ నిపా వైరస్‌ సోకినవారిలోనూ కన్పిస్తాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కావడంతో, కేరళకు వెళ్ళి వచ్చినవారు మూడు వారాల్లోగా నిపా వైరస్‌ సోకినట్లుగా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని మినిస్ట్రీ హెచ్చరించింది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com