అగ్నిప్రమాదంపై హెచ్ఎంసి విచారం
- December 08, 2015
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) తమ స్టాప్ అకామిడేషన్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి తమ ఉద్యోగి భార్య మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెచ్ఎంసి టెక్నీషియన్ రఫీల్ పింగుల్ భార్య చోనా ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందగా, కుమార్తె మిసీలా ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది. అలాగే పింగ్ కుమారుడు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నాడు. హెచ్ఎంసి తమ ఉద్యోగుల కోసం క్వార్టర్స్ని నిర్వహిస్తోంది. ప్రమాదం తర్వాత క్వార్టర్స్లో ఎమర్జన్సీ సౌకర్యాల్ని మరింతగా పెంచాల్సిన ఆవశ్యకతపై హమాద్ మెడికల్ కార్పొరేషన్ దృష్టిపెట్టింది. ప్రమాదం సంభవించిన క్వార్టర్స్ నుంచి చాలామంది ఉద్యోగుల కుటుంబాలు ఖాళీ చేసేశాయి. వారికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను హెచ్ఎంసి చేపట్టింది. ప్రమాద కారణాల్ని అన్వేషించి, ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







