ఇరాక్:13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన
- June 03, 2018
నిజామాబాద్:ఇరాక్లో 13 మంది తెలంగాణవాసులు బంధీలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. భారీగా వేతనాలు అంటూ తమను బశ్రా ప్రాంతానికి ఏజెంట్లు అక్రమంగా తరలించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు బాధితులు షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం. తమకు కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని, ఏజెంట్లు తమను మోసం చేశారంటూ వాట్సాప్ ద్వారా బాధితులందరూ కలిసి ఓ వీడియో పంపారు.
తెలంగాణ ప్రభుత్వం తమ వాళ్లను ఆదుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల సంఘం ప్రతినిధి బసంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దృష్టికి ఇరాక్లో తెలంగాణ వాసుల బంధీ సమస్యను తీసుకెళ్లారు. ప్రస్తుతం బాగ్దాద్ లోని బశ్రాలో ఓ ప్రైవేట్ కంపెనీలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

తాజా వార్తలు
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!







