57 మంది జవాన్లు మృతి ..
- December 09, 2015
ఈ ఏడాది ఉగ్రదాడుల్లో 57 మంది జవాన్లు మృతి సొంత వూళ్లను వదిలి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు ఎందరో. కర్తవ్య నిర్వహణలో భాగంగా ఏటా పదుల మంది సైనికులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా.. గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది నవంబర్ 30 వరకు ఉగ్రవాదులను అడ్డుకునే ప్రయత్నంలో 57మంది సైనికులు మృతిచెందారు. ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనిక సిబ్బందిపై రక్షణశాఖ(స్వతంత్ర) మంత్రి ఇందర్జీత్సింగ్ రావు రాజ్యసభలో నివేదిక అందించారు. కేవలం జూన్, నవంబర్ మధ్య కాలంలోనే 38మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో పాటు ఈ ఏడాది కాలంలో పొరుగు దేశమైన పాకిస్థాన్ 151 సార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో ఆరుగురు సైనిక సిబ్బంది కూడా మృతిచెందారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







