రియాద్లో జిసిసి సమ్మిట్ ప్రారంభం
- December 09, 2015
గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్ సౌదీ రాజధాని రియాద్ చేరుకున్నారు. 36వ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సమ్మిట్ కోసం జిసిసి దేశాలకు చెందిన ప్రముఖ నేతలు రియాద్కి వచ్చారు. ఈ సమ్మిట్లో గల్ఫ్ దేశాల మధ్య ఐక్యత మరింత పెరగడానికి తగిన సూచనలు, సలహాల్ని నేతలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. అలాగే సిరియా, యెమెన్లోని సంక్షోభం గురించి కూడా చర్చిస్తారు. ఆయా దేశాల్లోని పరిస్థితులపై చర్చించి, అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి తగిన చర్యలను కూడా గుర్తిస్తారు ఈ సమ్మిట్లో జిసిసి నాయకులు. తీవ్రవాద స్థావరాలపై సంయుక్తంగా దాడులు చేయడం, తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లోని ప్రజలకు రక్షణ కల్పించడం, తగిన వైద్య సహాయం అందించడం వంటివి ముఖ్య అంశాలుగా జిసిసి సమ్మిట్లో చర్చకు రానున్నాయి. అలాగే, అభివృద్ధిలో గల్ఫ్ దేశాలు శరవేగంగా ముందుకు వెళ్ళడానికి పరస్పర సహకారం అందించుకోవడమెలా? అన్నదానిపైన కూడా నాయకులు చర్చిస్తారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







