బహ్రెయిన్: జీతాల కోసం కార్మికుల ఆందోళన
- June 12, 2018
బహ్రెయిన్:ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కార్మికులు, తమకు జీతాలు చెల్లించడంలేదంటూ లేబర్ కోర్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్కి చెందిన కార్మికులే ఎక్కువగా వున్నారు బాధితుల్లో. నాలుగు నెలలకు పైగానే వీరందరికీ సదరు కంపెనీ జీతాలు చెల్లించడంలేదు. కాగా, లేబర్ కోర్ట్ వైపు వెళుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డగించారు. తిరిగి వారిని లేబర్ కేంప్స్కి వెళ్ళేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారి ప్రతినిథుల్ని మాత్రం లేబర్ మినిస్ట్రీ అధికారుల్ని కలిసేందుకు పోలీసులు అనుమతించారు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ వద్ద కార్మికుల్ని అడ్డుకుని, వారిని బుజ్జగించి పోలీసులు వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. భారత జాతీయులే సదరు కంపెనీని నిర్వహిస్తున్నట్లు తేలింది. లేబర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారీ మాట్లాడుతూ, ఈ విషయమై మినిస్ట్రీ విచారణ ప్రారంభించిందని అన్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్