బహ్రెయిన్: జీతాల కోసం కార్మికుల ఆందోళన

- June 12, 2018 , by Maagulf
బహ్రెయిన్: జీతాల కోసం కార్మికుల ఆందోళన

బహ్రెయిన్:ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కార్మికులు, తమకు జీతాలు చెల్లించడంలేదంటూ లేబర్‌ కోర్ట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌కి చెందిన కార్మికులే ఎక్కువగా వున్నారు బాధితుల్లో. నాలుగు నెలలకు పైగానే వీరందరికీ సదరు కంపెనీ జీతాలు చెల్లించడంలేదు. కాగా, లేబర్‌ కోర్ట్‌ వైపు వెళుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డగించారు. తిరిగి వారిని లేబర్‌ కేంప్స్‌కి వెళ్ళేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారి ప్రతినిథుల్ని మాత్రం లేబర్‌ మినిస్ట్రీ అధికారుల్ని కలిసేందుకు పోలీసులు అనుమతించారు. అమెరికన్‌ మిషన్‌ హాస్పిటల్‌ వద్ద కార్మికుల్ని అడ్డుకుని, వారిని బుజ్జగించి పోలీసులు వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. భారత జాతీయులే సదరు కంపెనీని నిర్వహిస్తున్నట్లు తేలింది. లేబర్‌ మినిస్ట్రీ అసిస్టెంట్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ మొహమ్మద్‌ అలి అల్‌ అన్సారీ మాట్లాడుతూ, ఈ విషయమై మినిస్ట్రీ విచారణ ప్రారంభించిందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com