బహ్రెయిన్: జీతాల కోసం కార్మికుల ఆందోళన
- June 12, 2018
బహ్రెయిన్:ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన కార్మికులు, తమకు జీతాలు చెల్లించడంలేదంటూ లేబర్ కోర్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్కి చెందిన కార్మికులే ఎక్కువగా వున్నారు బాధితుల్లో. నాలుగు నెలలకు పైగానే వీరందరికీ సదరు కంపెనీ జీతాలు చెల్లించడంలేదు. కాగా, లేబర్ కోర్ట్ వైపు వెళుతున్న ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డగించారు. తిరిగి వారిని లేబర్ కేంప్స్కి వెళ్ళేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వారి ప్రతినిథుల్ని మాత్రం లేబర్ మినిస్ట్రీ అధికారుల్ని కలిసేందుకు పోలీసులు అనుమతించారు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ వద్ద కార్మికుల్ని అడ్డుకుని, వారిని బుజ్జగించి పోలీసులు వెనక్కి పంపినట్లు అధికారులు తెలిపారు. భారత జాతీయులే సదరు కంపెనీని నిర్వహిస్తున్నట్లు తేలింది. లేబర్ మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ అలి అల్ అన్సారీ మాట్లాడుతూ, ఈ విషయమై మినిస్ట్రీ విచారణ ప్రారంభించిందని అన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







