శంషాబాద్లో పేలిన రెడీమీ మొబైల్...
- June 13, 2018
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం. కానీ ఇప్పుడు ఆ స్థానాన్నిసెల్ ఫోన్ ఆక్రమించింది. స్మార్ట్ ఫోన్లతో అర చేతిలో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోనే కనిపిస్తోంది. అయితే వినియోగదారుల అజాగ్రత్తో.. లేదంటే తయారీలో లోపమో కానీ మొబైల్ ఫోన్లు పేలుతున్నాయి. శంషాబాద్లో ఓ యువకుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
చిట్టిబాబు ఇటీవల రెడీ మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగింది. మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. దాన్ని నుంచి పొగలు రావడంతో అప్రమత్తమయ్యాడు. వెంటనే ఫోన్ ను కిందికి విసిరేశాడు. క్షణాల్లో సెల్ ఫోన్ పేలిపోయింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిట్టిబాబు సెల్ ఫోన్ పేలుడుపై రెడ్ మీ కంపెనీకి ఫిర్యాదు చేశాడు.
ఇటీవల దుబాయ్లో ను సెల్ ఫోన్ పేలింది. ఒకతను ప్యాంట్ జేబులో పవర్బ్యాంక్తో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అయితే అది హఠాత్తుగా భారీ శబ్దంతో పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి.. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ షాపింగ్ మాల్లో ఈ ఘటన జరగడంతో.. అక్కడున్న వారందరూ భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడున్న సిబ్బంది మంటలు ఆర్పడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







