శంషాబాద్లో పేలిన రెడీమీ మొబైల్...
- June 13, 2018
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం. కానీ ఇప్పుడు ఆ స్థానాన్నిసెల్ ఫోన్ ఆక్రమించింది. స్మార్ట్ ఫోన్లతో అర చేతిలో సమస్త సమాచారం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎవ్వరి చేతిలో చూసినా సెల్ ఫోనే కనిపిస్తోంది. అయితే వినియోగదారుల అజాగ్రత్తో.. లేదంటే తయారీలో లోపమో కానీ మొబైల్ ఫోన్లు పేలుతున్నాయి. శంషాబాద్లో ఓ యువకుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
చిట్టిబాబు ఇటీవల రెడీ మీ 4ఏ మోడల్ మొబైల్ కొనుగోలు చేశాడు. కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు అతని ఫోన్ మోగింది. మాట్లేందుకు జేబులో ఉన్న ఫోన్ బయటకు తీశాడు. దాన్ని నుంచి పొగలు రావడంతో అప్రమత్తమయ్యాడు. వెంటనే ఫోన్ ను కిందికి విసిరేశాడు. క్షణాల్లో సెల్ ఫోన్ పేలిపోయింది. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. చిట్టిబాబు సెల్ ఫోన్ పేలుడుపై రెడ్ మీ కంపెనీకి ఫిర్యాదు చేశాడు.
ఇటీవల దుబాయ్లో ను సెల్ ఫోన్ పేలింది. ఒకతను ప్యాంట్ జేబులో పవర్బ్యాంక్తో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాడు. అయితే అది హఠాత్తుగా భారీ శబ్దంతో పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి.. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఓ షాపింగ్ మాల్లో ఈ ఘటన జరగడంతో.. అక్కడున్న వారందరూ భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడున్న సిబ్బంది మంటలు ఆర్పడంతో.. పెద్ద ప్రమాదం తప్పింది.
తాజా వార్తలు
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్లో భారీ భూకంపం..







