జిసిసి సమ్మిట్లో కీలక చర్చలు
- December 10, 2015
గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ (జిసిసి) యాన్యువల్ సమ్మిట్లో కీలక చర్చలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాల్ని పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్చలపై ఈ సమ్మిట్లో జిసిసి ముఖ్య నాయకులు చర్చలు జరిపారు. ఇంధన ధరల పతనం, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు నేతలు. అలాగే సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్కి మద్దతుగా నిలవాలని తీర్మానించారు. గల్ఫ్ మిలిటరీ ఫోర్సెస్ ఎమెన్లో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న తీవ్రవాదులతో పోరాడుతున్న వైనం కూడా చర్చకు వచ్చింది. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గల్ఫ్ దేశాలు ఉపేక్షించరాదని ఈ సమావేశంలో తీర్మానించారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌది అరేబియా మరియు యూఏఈ ప్రతినిథులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సౌదీ రాజధానిలో జరుగుతున్న ఈ సమావేశాలు గల్ఫ్ దేశాలను అభివృద్ధి పథంలో, ఏకతాటిపై నడిపిస్తాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







