యు.ఏ.ఈ లో వీసా ఉల్లంఘనులకు క్షమాభిక్ష పెట్టే యోచన...
- June 19, 2018
అబుదాబీ:యూఏఈ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి విదేశీయులకు క్షమాభిక్ష ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) ఓ నిర్ణయం తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎఫ్ఎఐసి ఛైర్మన్ అలి మొహమ్మద్ బిన్ హమ్మాద్ అల్ షామ్షి మాట్లాడుతూ, ఉల్లంఘనులు లీగల్ స్టాటస్ని సాధారణ పీజు చెల్లించి సరిదిద్దుకోవచ్చనీ, లేదంటే ఎలాంటి సమస్యలూ లేకుండా స్వచ్ఛందంగా దేశాన్ని వీడి పోవచ్చనీ అన్నారు. కొద్ది రోజుల్లోనే 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ వయా రెక్టిఫైయింగ్ యువర్ స్టేటస్' ప్రారంభమవుతుందని చెప్పారాయన. 2013లో మొత్తం 62,000 ఇల్లీగల్ రెసిడెంట్స్ క్షమాభిక్ష పొందారు. రెండు నెలలపాటు ఈ క్షమాభిక్ష పీరియడ్ కొనసాగింది. ఇదిలా వుంటే, కువైట్ ప్రకటించిన జనరల్ అమ్నెస్టీలో 130,000 ఇల్లీగల్ రెసిడెంట్స్కి ఊరట అందించిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. అమ్నెస్టీ విషయంలో యూఏఈ పాలసీ చాలా ప్రత్యేకమైనదని అల్ షామ్షి చెప్పారు. అమ్నెస్టీని వినియోగించుకుని, తమ స్టేటస్ని సరిదిద్దుకోవడం, లేదంటే దేశం విడిచి వెళ్ళడం చేయాలనీ ఈ రెండూ చేయని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఫారినర్స్ ఎఫైర్స్ అండ్ పోర్ట్ డిపార్ట్మెంట్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సయీద్ రెకాన్ అల్ రష్ది చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







