యు.ఏ.ఈ లో వీసా ఉల్లంఘనులకు క్షమాభిక్ష పెట్టే యోచన...
- June 19, 2018
అబుదాబీ:యూఏఈ రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి విదేశీయులకు క్షమాభిక్ష ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఎఫ్ఎఐసి) ఓ నిర్ణయం తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎఫ్ఎఐసి ఛైర్మన్ అలి మొహమ్మద్ బిన్ హమ్మాద్ అల్ షామ్షి మాట్లాడుతూ, ఉల్లంఘనులు లీగల్ స్టాటస్ని సాధారణ పీజు చెల్లించి సరిదిద్దుకోవచ్చనీ, లేదంటే ఎలాంటి సమస్యలూ లేకుండా స్వచ్ఛందంగా దేశాన్ని వీడి పోవచ్చనీ అన్నారు. కొద్ది రోజుల్లోనే 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ వయా రెక్టిఫైయింగ్ యువర్ స్టేటస్' ప్రారంభమవుతుందని చెప్పారాయన. 2013లో మొత్తం 62,000 ఇల్లీగల్ రెసిడెంట్స్ క్షమాభిక్ష పొందారు. రెండు నెలలపాటు ఈ క్షమాభిక్ష పీరియడ్ కొనసాగింది. ఇదిలా వుంటే, కువైట్ ప్రకటించిన జనరల్ అమ్నెస్టీలో 130,000 ఇల్లీగల్ రెసిడెంట్స్కి ఊరట అందించిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. అమ్నెస్టీ విషయంలో యూఏఈ పాలసీ చాలా ప్రత్యేకమైనదని అల్ షామ్షి చెప్పారు. అమ్నెస్టీని వినియోగించుకుని, తమ స్టేటస్ని సరిదిద్దుకోవడం, లేదంటే దేశం విడిచి వెళ్ళడం చేయాలనీ ఈ రెండూ చేయని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఫారినర్స్ ఎఫైర్స్ అండ్ పోర్ట్ డిపార్ట్మెంట్స్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సయీద్ రెకాన్ అల్ రష్ది చెప్పారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







