న్యూస్ చదువుతూ ఏడ్చిన యాంకర్
- June 20, 2018
అమెరికా:హద్దుల గురించి, సరిహద్దుల గురించి చిన్నారులకు ఏం తెలుస్తుంది. అమ్మా నాన్న ఎక్కడికి తీసుకు వెళితే అక్కడకు వారి వేలు పట్టుకుని వెళ్లడం మాత్రమే తెలుసు. పెద్దవాళ్ల గొడవల మధ్యలో అభం శుభం తెలియని చిన్నారులు నలిగిపోతున్నారు. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా తరలి వస్తున్నారంటూ ట్రంప్ ప్రభుత్వం వలసదారులను నిర్భంధిస్తోంది. తల్లిదండ్రుల నుంచి పిల్లలని వేరు చేస్తోంది. వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెండర్ ఏజ్ షెల్టర్లకు వారిని తరలిస్తుంది. ఈ దారుణానికి ఒడిగట్టిన అమెరికా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వార్తలు చదువుతున్న టీవీ యాంకర్ భావోద్వేగానికి గురైంది. ఆ న్యూస్ చదవలేక లైవ్లోనే ఏడ్చేసింది. ఎంఎస్ఎన్బీకి చెందిన యాంకర్ రేచల్ మాడో ఇప్పుడే అందిన వార్త అంటూ తల్లిదండ్రులు కనిపించక పిల్లలు ఏడుస్తున్నారు అని వార్త చదివేసరికి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఆ తరువాత ఆమె క్షమాపణలు చెప్పింది. తనను తాను నియంత్రించుకోలేకపోయానని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







