ఇండోనేషియా:సరస్సులో మునిగిన బోటు.. 180 మంది గల్లంతు
- June 20, 2018
సుమత్రా: ఇండోనేషియాలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న 180 ప్రయాణికులు ఆచూకీ లేకుండాపోయింది. సామర్థ్యం కంటే మూడు రేట్లు ఎక్కువ మంది ప్రయాణికులు బోటులో ఉన్నట్లు తెలుస్తోంది. లేక్ తోబాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సు పర్యాటకులు వచ్చారు. ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. బోటులోనే అనేక మంది ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 18 మందిని మాత్రమే రక్షించారు. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. గజ ఈతగాళ్లు, అండర్వాటర్ డ్రోన్లతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఏ ప్రాంతంలో బోటు మునిగిందన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. సుమారు 25 మంది డైవర్లు .. అదృశ్యమైనవారి కోసం అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









