ఇండోనేషియా:సరస్సులో మునిగిన బోటు.. 180 మంది గల్లంతు

- June 20, 2018 , by Maagulf
ఇండోనేషియా:సరస్సులో మునిగిన బోటు.. 180 మంది గల్లంతు

సుమత్రా: ఇండోనేషియాలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న 180 ప్రయాణికులు ఆచూకీ లేకుండాపోయింది. సామర్థ్యం కంటే మూడు రేట్లు ఎక్కువ మంది ప్రయాణికులు బోటులో ఉన్నట్లు తెలుస్తోంది. లేక్ తోబాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సు పర్యాటకులు వచ్చారు. ప్రస్తుతం సుమత్రా దీవుల్లో వాతావరణం ప్రతికూలంగా ఉంది. బోటులోనే అనేక మంది ప్రయాణికులు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 18 మందిని మాత్రమే రక్షించారు. అయితే ఈ విషాదంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా స్పష్టంగా తెలియదు. గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఏ ప్రాంతంలో బోటు మునిగిందన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. సుమారు 25 మంది డైవర్లు .. అదృశ్యమైనవారి కోసం అన్వేషిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com