వీరిలో 52 మంది భారతీయులున్నారని.. వారి పిల్లలను, జీవిత భాగస్వాముల నుంచి వేరు చేస్తున్నారు.
- June 20, 2018
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. అమెరికా- మెక్సికో సరిహద్దు వద్ద అక్రమ వలసదారుల రాకను నిరోధించేందుకు అమెరికా పోలీసులు రంగంలోకి దిగారు. వేలాది మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. వీరిలో 52 మంది భారతీయులున్నారని.. వారి పిల్లలను, జీవిత భాగస్వాముల నుంచి వేరు చేస్తున్నారు.
అరెస్టయిన వారిని ఓరెగాన్ లోని ఫెడరల్ జైల్లో బంధించిన అధికారులు, చట్ట వ్యతిరేకంగా తమ దేశంలోకి వచ్చే వారిని ఇకపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో 123 మంది వలసదారులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికంగా దక్షిణాసియా వారే వున్నారు. హిందీ, పంజాబీ మాట్లాడే వారి సంఖ్యే ఇందులో అధికంగా వున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు వచ్చే వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి, శరణాలయాలకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు కనిపించకుండా వారు ఎప్పుడు వస్తారో తెలియక పిల్లలు బోరున విలపిస్తున్నారు. ఆ పిల్లలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి. ట్రంప్ సర్కారు వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ, ఆయన మాత్రం వలసదారుల విషయంలో మెత్తబడే సమస్యే లేదని స్పష్టం చేస్తున్నారు. కుటుంబం నుంచి పిల్లలను వేరు చేయాలన్న ఆలోచన అత్యంత కిరాతకమైన చర్యని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









