ఈనెల 28 నుంచి అమరనాథ్ యాత్ర!
- June 23, 2018
హిందువుల పవిత్ర అమరనాథ్ యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభంకానుంది. 60రోజుల పాటు కొనసాగనున్న యాత్ర.. ఆగస్ట్ 26న ముగుస్తుంది. దాదాపు ఆరు లక్షల మంది భక్తలు మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో ఈ సారి యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. యాత్ర అడుగడుగునా భారీగా బలగాలను మోహరించాయి.
అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. అనంతనాగ్ సమీపంలోని అమర్నాథ్ యాత్ర మార్గంలో IJKS ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు తెగబడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో భక్తులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. బేస్ క్యాంపుల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు ట్రాకింగ్ చిప్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వారు ఎటు వెళ్తున్నారన్న విషయంపై భద్రతా దళాలు ఫోకస్ పెట్టనున్నాయి. గతంలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ దఫా అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
అమర్నాథ్ యాత్ర కోసం బల్టాల్, పహల్గాం రూట్లలో NSG కమాండోలను కేంద్రం తొలిసారి మోహరిస్తోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ధీటుగా ఎదుర్కొనేందుకైనా సిద్ధమైంది. ఎక్కడికైనా నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే కమాండోల కోసం బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది.
హిందువుల పవిత్ర అమరనాథ్ యాత్ర ఈనెల 28 నుంచి ప్రారంభంకానుంది. 60రోజుల పాటు కొనసాగనున్న యాత్ర.. ఆగస్ట్ 26న ముగుస్తుంది. దాదాపు ఆరు లక్షల మంది భక్తలు మంచు లింగాన్ని దర్శించుకోనున్నారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో ఈ సారి యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. యాత్ర అడుగడుగునా భారీగా బలగాలను మోహరించాయి.
అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. అనంతనాగ్ సమీపంలోని అమర్నాథ్ యాత్ర మార్గంలో IJKS ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చిన నేపథ్యంలో ప్రతీకార దాడులకు తెగబడే ప్రమాదం పొంచి ఉంది. దీంతో భక్తులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. బేస్ క్యాంపుల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు ట్రాకింగ్ చిప్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వారు ఎటు వెళ్తున్నారన్న విషయంపై భద్రతా దళాలు ఫోకస్ పెట్టనున్నాయి. గతంలో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ దఫా అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
అమర్నాథ్ యాత్ర కోసం బల్టాల్, పహల్గాం రూట్లలో NSG కమాండోలను కేంద్రం తొలిసారి మోహరిస్తోంది. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ధీటుగా ఎదుర్కొనేందుకైనా సిద్ధమైంది. ఎక్కడికైనా నిమిషాల్లో చేరుకునేందుకు వీలుగా శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే కమాండోల కోసం బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







