భారత్ దేశవ్యాప్తంగా ఏటీఎమ్ ల భద్రతపై ఆర్బిఐ ఆందోళన
- June 26, 2018
సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతోంది. రోజుకో సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులోకి వస్తోంది. అందుకు తగ్గట్లే... వైరస్లు, మాల్వేర్లు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్ల కిందటి పాతబడిన సాఫ్ట్వేర్ వాడుతున్న ATM లు ఎంతవరకు సురక్షితం. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకే చెమటలు పట్టిస్తున్న హ్యాకర్లు.. నిన్నటితరం సాఫ్ట్వేర్ను వదులుతారా..? ఇదే సందేహం వచ్చింది RBI కి. అందుకే దేశవ్యాప్తంగా బ్యాంకులన్నింటికీ హెచ్చరికలు పంపింది. ఏడాదిలోగా అన్ని ATM లలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేలాది ATM లలో విండోస్ XP ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారు. పదేళ్ల కిందటి ఈ OS కు మైక్రోసాఫ్ట్ కంపెనీ సపోర్ట్ కూడా నిలిపేసింది. అంటే ఏ సమస్య వచ్చినా... మిషన్ పని గోవిందా అన్న మాట. అంతేకాదు.. ఇప్పటికే దీనికి అనేక మాల్వేర్లు పుట్టుకొచ్చాయి. కార్డు ఇన్సర్ట్ చేయకుండా మనీ విత్డ్రా చేసేలా ప్రోగ్రాంలు తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ నేపథ్యంలో 2019 మార్చి నాటికి అన్ని ATM ల ఆపరేటింగ్ సిస్టం మార్చేయాడంతో పాటు.. యాంటీ స్కిమ్మింగ్ ఏర్పాట్లు చేయాలంది. అలాగే 2018 ఆగస్టు నాటికి కొత్త BIOS పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని... మిషన్లకు ఉండే USB పోర్టులు డిసేబుల్ చేయాలని... ఆటోరన్ ఆప్షన్ పనిచేయకుండా చేయాలని. తాజా సెక్యూరిటీ ప్యాచ్లు అప్లై చేయాలని... RBI ఆదేశాలిచ్చింది. లేదంటే ఎదురయ్యే పరిణామాలను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది...
RBI చేసిన సూచనలను నిపుణులు స్వాగతిస్తున్నారు. ATM లలో ఇలాంటి సమస్యలున్నట్లు చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నా బ్యాంకులు స్పందించడం లేదని.. దీనివల్ల ఇప్పటికే అనేక మోసాలు జరిగాయని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా బ్యాంకులు ఈ చర్యలు చేపట్టకపోతే... ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటాయని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









