టీనేజ్ డ్రగ్ స్మగ్లర్స్కి పదేళ్ళ జైలు
- June 30, 2018
బహ్రెయిన్ కస్టమ్స్ అధికారులు 17 ఏళ్ళ ఇండియన్ యువకుడ్ని మరిజువానా స్మగ్లింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 ఏళ్ళ వయసున్న తన సహచరుడికి అందించేందుకు ఈ డ్రగ్స్ని నిందితుడు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. బ్యాగ్ని ఎక్స్రే చేయగా, అందులో న్యూస్ పేపర్స్తో చేసిన నాలుగు బాల్స్ కన్పించాయనీ, వాటిని మ్యాన్యువల్గా తనిఖీ చేసి, ఓపెన్ చేయగా, అందులోంచి మరిజువానా బయటపడిందని అధికారులు చెప్పారు. అర కిలోగ్రాము వరకు ఈ డ్రగ్ బరువు తూగింది. నిందితులిద్దరికీ 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే చెరొక 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని సైతం న్యాయస్థానం ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









