టీనేజ్ డ్రగ్ స్మగ్లర్స్కి పదేళ్ళ జైలు
- June 30, 2018
బహ్రెయిన్ కస్టమ్స్ అధికారులు 17 ఏళ్ళ ఇండియన్ యువకుడ్ని మరిజువానా స్మగ్లింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 ఏళ్ళ వయసున్న తన సహచరుడికి అందించేందుకు ఈ డ్రగ్స్ని నిందితుడు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. బ్యాగ్ని ఎక్స్రే చేయగా, అందులో న్యూస్ పేపర్స్తో చేసిన నాలుగు బాల్స్ కన్పించాయనీ, వాటిని మ్యాన్యువల్గా తనిఖీ చేసి, ఓపెన్ చేయగా, అందులోంచి మరిజువానా బయటపడిందని అధికారులు చెప్పారు. అర కిలోగ్రాము వరకు ఈ డ్రగ్ బరువు తూగింది. నిందితులిద్దరికీ 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే చెరొక 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని సైతం న్యాయస్థానం ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







