టీనేజ్ డ్రగ్ స్మగ్లర్స్కి పదేళ్ళ జైలు
- June 30, 2018బహ్రెయిన్ కస్టమ్స్ అధికారులు 17 ఏళ్ళ ఇండియన్ యువకుడ్ని మరిజువానా స్మగ్లింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 16 ఏళ్ళ వయసున్న తన సహచరుడికి అందించేందుకు ఈ డ్రగ్స్ని నిందితుడు తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. బ్యాగ్ని ఎక్స్రే చేయగా, అందులో న్యూస్ పేపర్స్తో చేసిన నాలుగు బాల్స్ కన్పించాయనీ, వాటిని మ్యాన్యువల్గా తనిఖీ చేసి, ఓపెన్ చేయగా, అందులోంచి మరిజువానా బయటపడిందని అధికారులు చెప్పారు. అర కిలోగ్రాము వరకు ఈ డ్రగ్ బరువు తూగింది. నిందితులిద్దరికీ 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే చెరొక 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని సైతం న్యాయస్థానం ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!