164 ఏళ్లలో బ్రిటన్లో తొలిసారి తుఫాను హెచ్చరికలు
- July 01, 2018
బ్రిటన్కు చెందిన వాతావరణ శాఖ కార్యాలయం తన 164 ఏళ్ల చరిత్రలో తొలిసారి తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నైరుతి ఇంగ్లండ్, వేల్స్ ప్రాంతాల్లో కుండపోతతోపాటు వడగండ్లు, పిడుగులు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ వాతావరణ శాఖ గత నెలలోనే తుఫాను హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటుచేసింది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదంపై హెచ్చరికలు జారీ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. భారీ వర్షం కారణంగా ఇళ్లు, వ్యాపార సముదాయల్లోకి వరద వచ్చే ప్రమాదం కూడా ఉందని స్పష్టంచేసింది. గంటకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షం కురవొచ్చని అంచనా వేసింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







