అన్న ఐపీఎస్ అధికారి.. తమ్ముడు ఉగ్రవాది!
- July 08, 2018
జమ్ముకాశ్మీర్లో ఓ ఐపీఎస్ అధికారి సోదరుడు హిజ్బుల్ ముజాహిదీన్లో చేరడం కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన అతను ఉగ్రవాదంవైపు ఆకర్షితుడు అయ్యుండొచ్చని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమని తేలింది.
ఈ ఏడాది మే 22న కాశ్మీర్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి షంషల్ హక్ మెంగినూ అదృశ్యమయ్యాడు. ఇప్పుడు అతని ఫొటో హిజ్బుల్ వెబ్సైట్లో కనిపిస్తోంది. తుపాకీ చేతపట్టి ఫొటోకు ఫోజిచ్చాడు. కొత్తగా 12 మందిని రిక్రూట్ చేసుకున్నట్టు లిస్టు బయటకు రావడం.. అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
కాశ్మీర్లోని సోపియాన్ ప్రాంతానికి చెందిన ఇనాముల్ హక్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన దేశం కోసం అంకితభావంతో 2012లోనే సివిల్ సర్వీసెస్లోకి వస్తే.. సోదరుడు ఉగ్రవాదం వైపు మళ్లడం చర్చనీయాంశమైంది. అటు, హిజ్బుల్ రిలీజ్ చేసిన ఫొటో ప్రకారం షంషల్ హక్ మెంగినూకు బురాన్ సనీ పేరుతో ఓ కోడ్ నేమ్ ఉంది. మే 25న అతను తమ టీమ్లో చేరినట్టు హిజ్బుల్ ప్రకటించింది.
కొద్ది కాలంగా విద్యావంతులైన యువత కూడా టెర్రరిజంవైపు మొగ్గుతున్నారు. జమ్ముకాశ్మీర్ ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఈ ఏడాది 50 మంది పాక్ ప్రేరేపిత సంస్థల్లో చేరిపోయారు. ఈ పరిణామాలన్నీ లోయలో నెలకొన్న అశాంతికి అద్దం పడుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









