స్వామి పరిపూర్ణానందకు నోటీసులు
- July 10, 2018
దైవ సృష్టిలో అన్నికులాలు, మతాలు ఒకటే అన్నారు స్వామి పరిపూర్ణానంద. ధర్మాగ్రహ దీక్ష చేయకుండా హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. భావ ప్రకటన స్వేచ్చ పేరుతో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కోట్లాది మంది ప్రజల హృదయాలను గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మతాల ఉనికిని దెబ్బ తీస్తే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్న పరిపూర్ణానంద.. హిందూధర్మంపై బాబు గోగినేని దుర్మార్గపు భావజాలాన్ని రుద్దుతున్నారని మండిపడ్డారు.
అటు..స్వామి పరిపూర్ణానంద గృహనిర్బంధం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లో ఆయన ఉన్న నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎవ్వరూ రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. నిన్న పరిపూర్ణానంద తలపెట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. జూబ్లీహిల్స్లోనే ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు.
ధర్మాగ్రహ యాత్రకు అనుమతి లేదంటున్న పోలీసులు.. పరిపూర్ణానందకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చారు. దీని ప్రకారం శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా..ర్యాలీలు, సభలు, సమావేశాలు చేస్తే అరెస్ట్కు అవకాశం ఉంటుంది. అటు.. పరిపూర్ణానందతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరిపూర్ణానంద ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన యాత్ర చేసేందుకు బయటికి వస్తే అరెస్ట్ తప్పదని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







