200,000 దిర్హామ్ల ప్రైజ్ మనీ: అంతా ఫేక్
- July 11, 2018
వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఫేక్ మెసేజ్ల ప్రచారానికి అడ్డుకట్ట పడటంలేదు. హైపర్ మార్కెట్స్, ప్రముఖ బ్రాండ్స్ పేరుతో భారీ బహుమతులంటూ ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. 'లక్కీ డ్రా ప్రోమో 2018 పేరుతో కొత్తగా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. లులు హైపర్ మార్కెట్, విజేతకు 200,000 దిర్హామ్లు అందజేస్తుందన్నది ఈ మెసేజ్ సారాంశం. అయితే ఇదంతా ఫేక్ వ్యవహారమని కొట్టి పారేశారు లులు హైపర్ మార్కెట్ నిర్వాహకులు. గతంలోనే లులు హైపర్ మార్కెట్ ఈ తరహా ఫేక్ మోసాలపై వినియోగదారుల్ని అప్రమత్తం చేసింది. విజేతలకు 200,000 దిర్హామ్లు అందజేయడం కోసం బ్యాంక్ డిటెయిల్స్ ఇవ్వాలంటూ స్కామర్లు ఒత్తిడి చేయడం, వారి ఒత్తిడికి తలొగ్గి బ్యాంక్ డిటెయిల్స్ ఇచ్చి అమాయకులు నిండా మునిగిపోవడం జరుగుతోంది. ఇలాంటి ఫేక్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







