200,000 దిర్హామ్‌ల ప్రైజ్‌ మనీ: అంతా ఫేక్‌

- July 11, 2018 , by Maagulf
200,000 దిర్హామ్‌ల ప్రైజ్‌ మనీ: అంతా ఫేక్‌

వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా ఫేక్‌ మెసేజ్‌ల ప్రచారానికి అడ్డుకట్ట పడటంలేదు. హైపర్‌ మార్కెట్స్‌, ప్రముఖ బ్రాండ్స్‌ పేరుతో భారీ బహుమతులంటూ ఫేక్‌ మెసేజ్‌లు సర్క్యులేట్‌ అవుతున్నాయి. 'లక్కీ డ్రా ప్రోమో 2018 పేరుతో కొత్తగా ఓ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. లులు హైపర్‌ మార్కెట్‌, విజేతకు 200,000 దిర్హామ్‌లు అందజేస్తుందన్నది ఈ మెసేజ్‌ సారాంశం. అయితే ఇదంతా ఫేక్‌ వ్యవహారమని కొట్టి పారేశారు లులు హైపర్‌ మార్కెట్‌ నిర్వాహకులు. గతంలోనే లులు హైపర్‌ మార్కెట్‌ ఈ తరహా ఫేక్‌ మోసాలపై వినియోగదారుల్ని అప్రమత్తం చేసింది. విజేతలకు 200,000 దిర్హామ్‌లు అందజేయడం కోసం బ్యాంక్‌ డిటెయిల్స్‌ ఇవ్వాలంటూ స్కామర్లు ఒత్తిడి చేయడం, వారి ఒత్తిడికి తలొగ్గి బ్యాంక్‌ డిటెయిల్స్‌ ఇచ్చి అమాయకులు నిండా మునిగిపోవడం జరుగుతోంది. ఇలాంటి ఫేక్‌ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖలు సూచిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com