200,000 దిర్హామ్ల ప్రైజ్ మనీ: అంతా ఫేక్
- July 11, 2018
వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఫేక్ మెసేజ్ల ప్రచారానికి అడ్డుకట్ట పడటంలేదు. హైపర్ మార్కెట్స్, ప్రముఖ బ్రాండ్స్ పేరుతో భారీ బహుమతులంటూ ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. 'లక్కీ డ్రా ప్రోమో 2018 పేరుతో కొత్తగా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. లులు హైపర్ మార్కెట్, విజేతకు 200,000 దిర్హామ్లు అందజేస్తుందన్నది ఈ మెసేజ్ సారాంశం. అయితే ఇదంతా ఫేక్ వ్యవహారమని కొట్టి పారేశారు లులు హైపర్ మార్కెట్ నిర్వాహకులు. గతంలోనే లులు హైపర్ మార్కెట్ ఈ తరహా ఫేక్ మోసాలపై వినియోగదారుల్ని అప్రమత్తం చేసింది. విజేతలకు 200,000 దిర్హామ్లు అందజేయడం కోసం బ్యాంక్ డిటెయిల్స్ ఇవ్వాలంటూ స్కామర్లు ఒత్తిడి చేయడం, వారి ఒత్తిడికి తలొగ్గి బ్యాంక్ డిటెయిల్స్ ఇచ్చి అమాయకులు నిండా మునిగిపోవడం జరుగుతోంది. ఇలాంటి ఫేక్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







