వరంగల్ మహిళ కౌసర్‌కు అరుదైన అవకాశం

- July 12, 2018 , by Maagulf
వరంగల్ మహిళ కౌసర్‌కు అరుదైన అవకాశం

వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. గత కొద్ది రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలుకరించేందుకు ప్రధాన మంత్రి జన్‌సంవాద్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) వర్గానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. ఈ క్రమంలో మోదీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్‌కు లభించింది. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కౌసర్.. ప్రధానితో ముచ్చటించారు. దేశంలోని పలు రాష్ర్టాల్లో మహిళలు పొదుపు పాఠాలు చెప్పిన కౌసర్.. ఎంతో మంది మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ నేడు దేశవ్యాప్తంగా ఆమెకు ఖ్యాతిని పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com