తప్పును సరిదిద్దుకున్నఇరాన్..భారత్ తలొగ్గుతోందంటూ..
- July 12, 2018
అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గుతోందని ఇరాన్ ఆరోపణలు చేసింది. చమురు దిగుమతిని తగ్గించుకుంటే ప్రత్యేక హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించిన మరుసటి రోజే తన వాదనను వెనక్కు తీసుకుంది. ట్రంప్ ఆంక్షలతో భారత్ సహా చాలా దేశాలు ప్రభావితమవుతున్నాయని భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించింది. నవంబర్ 4 నాటికి చమురు దిగుమతులు జీరో అవ్వాలని, లేకపోతే పలు ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ రాయబారి భారత్పై అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన తప్పును సరిదిద్దుకున్నారు. భారత్కు చమురు దిగుమతి విషయంలో తమ వంతు పాత్రను బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పారు. భారత్తో తమకు ఎప్పుడూ మంచి బంధాలే ఉన్నాయని ఇరాన్ రాయబారి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







