తప్పును సరిదిద్దుకున్నఇరాన్..భారత్ తలొగ్గుతోందంటూ..

- July 12, 2018 , by Maagulf
తప్పును సరిదిద్దుకున్నఇరాన్..భారత్ తలొగ్గుతోందంటూ..

అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గుతోందని ఇరాన్ ఆరోపణలు చేసింది. చమురు దిగుమతిని తగ్గించుకుంటే ప్రత్యేక హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించిన మరుసటి రోజే తన వాదనను వెనక్కు తీసుకుంది. ట్రంప్ ఆంక్షలతో భారత్ సహా చాలా దేశాలు ప్రభావితమవుతున్నాయని భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించింది. నవంబర్ 4 నాటికి చమురు దిగుమతులు జీరో అవ్వాలని, లేకపోతే పలు ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ రాయబారి భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన తప్పును సరిదిద్దుకున్నారు. భారత్‌కు చమురు దిగుమతి విషయంలో తమ వంతు పాత్రను బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పారు. భారత్‌తో తమకు ఎప్పుడూ మంచి బంధాలే ఉన్నాయని ఇరాన్ రాయబారి క్లారిటీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com