అశృనయనాల మధ్య శరత్ అంత్యక్రియలు
- July 12, 2018
అశృనయనాల మధ్య శరత్ అంత్యక్రియలు స్వగ్రామం కరీమాబాద్లో జరిగాయి... శరత్ భౌతిక కాయానికి మంత్రి కడియం శ్రీహరి నివాళులర్పించారు... అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు... శరత్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని మంత్రి కడియం హామీ ఇచ్చారు...
అమెరికాలోని కాన్సాస్లో నల్లజాతీయుడి కాల్పుల్లో మృతిచెందిన కొప్పు శరత్ అంత్యక్రియలు అతని స్వగ్రామం వరంగల్ జిల్లా కరీమాబాద్లో అశృనయనాల మధ్య పూర్తయ్యాయి... సుదీర్ఘ నీరీక్షణ తరువాత హైదరాబాద్ చేరుకున్న శరత్ భౌతిక కాయాన్ని.. వరంగల్ జిల్లా కరీమాబాద్కు కుటుంబ సభ్యులు తరలించారు. శరత్ భౌతిక కాయానికి మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే కొండా సురేఖ్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు నివాళులర్పించారు. శరత్ అంతిమయాత్రలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతినగర్ స్మశాన వాటికలో శరత్కు.. కుటుంబ సభ్యులు.. స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు.
కొప్పు రామ్మోహన్, మాలతి దంపతులకు శరత్ ఏకైక కుమారుడు. ఎం.ఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన శరత్ కాన్సాస్లో ఎంఎస్ చేస్తూ.. ఓ రెస్టారెంట్లో పార్ట్ టైమ్ జాబ్ చేసేవాడు. గత శుక్రవారం సాయంత్రం డ్యూటీలో ఉండగా ఓ వ్యక్తి రెస్టారెంట్లోకి వచ్చి గన్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయంతో రెస్టారెంట్ సిబ్బందితో పాటు ముగ్గురు కస్టమర్ టేబుళ్ల కింద దాక్కున్నారు. శరత్ మాత్రం భయంతో పరుగులు తీయటంతో.. నిందితుడు శరత్పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆస్పత్రికి తరలించగా.. శరత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆరు రోజుల తరువాత శరత్ భౌతిక కాయం హైదరాబాద్ చేరుకోవడం అక్కడి నుంచి వరంగల్ జిల్లా కరీమాబాద్కు తరలించారు... బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య శరత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి... మృతదేహం అమెరికా నుంచి తెప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







