సవాళ్ళను ఎదుర్కొంటున్న 'సాక్ష్యం'
- July 12, 2018
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ హిట్ రాకపోయినా వరసగా భారీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపపధ్యంలో ఈ నెల 27న విడుదల అవుతున్న 'సాక్ష్యం' సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ అందర్నీ ఆకర్షిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ నడుస్తోంది.
అయితే ఈ సినిమాను టార్గెట్ చేస్తూ మెగా అక్కినేని కుటుంబాలకు చెందిన రెండు సినిమాలు పోటీ పడుతూ ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. నిహారిక సుమంత్ అశ్విన్ లు జంటగా నటించిన హ్యాపీ వెడ్డింగ్ అదేవిధంగా సుశాంత్ హీరోగా నటించిన అన్నపూర్ణ స్టూడియోస్ 'చి.ల.సౌ.' ఇదే డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతూ బెల్లంకొండను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
పేరుకు ఈ సినిమాలు చిన్న సినిమాలే అయినా వీటి వెనుక ఇండస్ట్రీ పెద్ద కుటుంబాలు ఉండటంతో ఈ మూడు సినిమాల మధ్య పోటీ ధియేటర్స్ వార్ కు తెర తీస్తోంది. చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా మారిన 'సాక్ష్యం' మూవీ పై భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు.
తెలుస్తున్న సమాచారం మేరకు 'సాక్ష్యం' సినిమాకు 40 కోట్ల బిజినెస్ జరిగింది అని వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఈసినిమాకు ఇంత సీన్ ఉందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్ర నైజాం హక్కుల్ని 7 కోట్లకు కొనుకున్నాడు అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ మాన్ సూన్ ఫైట్ విజేత ఎవరు అనే విషయం పై ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు పెరుగుతున్నాయి..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









