సెలెక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా తారక్
- July 13, 2018
మొబైల్ రిటైల్ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ప్రముఖ మొబైల్ సంస్థ సెలెక్ట్ తన బ్రాండ్ అంబాసిడర్గా టాలీవుడ్ స్టార్ను నియమించుకుంది. ప్రముఖ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్టు ఈ కంపెనీ చెప్పింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని జూలై 13న మూడు గంటలకు హైటెక్ సిటీలోని ఐటీసీ కోహెనుర్లో నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి మీడియాను, సన్నిహిత వర్గాలను సెలెక్ట్ మొబైల్స్ ఆహ్వానిస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ ఈ బ్రాండ్ కోసం షూట్ కూడా చేయనున్నారని తెలిసింది.
ఎన్టీఆర్ను సెలెక్ట్ మొబైల్స్ తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడంతో, రామ్ చరణ్, అల్లు అర్జున్ క్లబ్లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. రామ్ చరణ్ హ్యాపీ మొబైల్స్కు, అల్లు అర్జున్ లాట్ మొబైల్స్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న సంగతి తెలిసిందే. తిరుపతి, హైదరాబాద్లో స్టోర్లను ఏర్పాటు చేసిన సెలెక్ట్ మొబైల్స్ తన కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించింది. తొలుత దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో 500 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలోనే చెప్పింది. ఆ అనంతరం ఉత్తర భారత్పై ఫోకస్ చేయనున్నట్టు పేర్కొంది. ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్లను ఫిజికల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారని ఈ కంపెనీ చెబుతోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







