థాయిలాండ్ చిన్నారులు, కోచ్‌కు పౌరసత్వం ఇస్తామన్నారు

- July 15, 2018 , by Maagulf
థాయిలాండ్ చిన్నారులు, కోచ్‌కు పౌరసత్వం ఇస్తామన్నారు

థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన చిన్నారులపై అక్కడి ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. ఆరు నెలల్లోనే వారికి పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. 12 మంది చిన్నారుల్లో ముగ్గురు బాలలు, కోచ్ ఎకపోల్ చాంట్వాంగ్‌ ఏ దేశానికి చెందినవారు కాదు. వీరి కుటుంబాలు మయన్మార్ నుంచి థాయ్‌లాండ్ వచ్చి స్థిరపడటమే ఇందుకు కారణం. అయితే ఈ ముగ్గురు చిన్నారులకు ప్రాథమిక హక్కుల కింద ప్రభుత్వం ఐడీ కార్డులు జారీ చేసింది. తాజాగా చిన్నారుల స్థితిపై స్పందించిన ప్రభుత్వం కోచ్ సహా ముగ్గురు చిన్నారులకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com