నరేంద్ర మోదీ వీసా రికార్డులను అమెరికా ముందు ఉంచాలని ఆదేశం
- December 12, 2015
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీసాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని అమెరికా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోదీ అమెరికా రాకుండా విధించిన నిషేధం ఎత్తివేస్తూ బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సమర్పించాలని పేర్కొంది. 2016, జనవరి నెల మధ్యలో ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యూయార్క్ సదరన్ డిస్టిక్ట్ జడ్జి జాన్ కొయల్ టెల్ ఈ నెల 9న ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 29కు వాయిదా వేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నరేంద్ర మోదీ వీసా, అమెరికాలో ఆయన ప్రవేశానికి సంబంధించిన రికార్డులు (2013 జూన్ నుంచి) ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్జే కోర్టును ఆశ్రయించింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







