భారీ ప్లాన్లు వేస్తున్న భామ

- July 22, 2018 , by Maagulf
భారీ ప్లాన్లు వేస్తున్న భామ

కోటి పారితోషికం అందుకునే కథానాయికగా పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ పేరు వినిపించింది. కేవలం నాలుగేళ్లలో అగ్రకథానాయికగా ఎదిగేసిన రకుల్ కోటి పారితోషికం అందుకుందన్న ప్రచారం సాగింది. అయితే 'స్పైడర్' పరాజయం కెరీర్ పరంగా వెనకడుగు వేసేందుకు కారణమైంది. ఆ క్రమంలోనే రకుల్ తెలివైన గేమ్ ప్లాన్‌ని అనుసరిస్తోందిట.

తాజాగా సన్నివేశం చక్కదిద్దుకునేందుకు రకుల్ 20శాతం పారితోషికం కోసేసిందని తెలుస్తోంది. ఇదివరకూ 85లక్షలకు తగ్గిన రకుల్ అందులోనూ 20 శాతం తగ్గింపు తో సరిపెట్టుకుంటోందిట. ఆ క్రమంలోనే వెంకీ- చైతన్యల 'వెంకీ మామ'కు సంతకం చేసింది. ఆ వెంటనే బాలయ్య నిర్మిస్తూ నటిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్‌కి సంతకం చేసిందిట. రకుల్ తెలివైన నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com