అధికారులపై హత్యాయత్నం: ఆరుగురిపై విచారణ
- July 23, 2018
పోలీసు అధికారుల్ని చంపేందుకు యత్నించారంటూ ఆరుగురు యువకులపై కేసులు నమోదవగా, ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులంతా 16 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసున్న యువకులే. నువైద్రాత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్లు ధరించిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆందోళనల్ని అడ్డుకునేందుకు వెళ్ళిన తమపై దాడి చేశారనీ, ఈ క్రమంలో ఓ బాంబు పేలుడు సంభవించిందనీ, ఓ అధికారి గాయపడ్డారని, పెట్రోల్ కార్ డ్యామేజ్ అయ్యిందని అధికారులు వివరించారు. గాయపడ్డ పోలీసు అధికారిని, మిగతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 8 ఫైర్ బాంబులు, 22 బాటిల్స్ (మోలోటోవ్ కాక్టెయిల్స్ కోసం వినియోగించేవి) స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!