అధికారులపై హత్యాయత్నం: ఆరుగురిపై విచారణ
- July 23, 2018పోలీసు అధికారుల్ని చంపేందుకు యత్నించారంటూ ఆరుగురు యువకులపై కేసులు నమోదవగా, ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితులంతా 16 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసున్న యువకులే. నువైద్రాత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్లు ధరించిన 20 నుంచి 25 మంది ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆందోళనల్ని అడ్డుకునేందుకు వెళ్ళిన తమపై దాడి చేశారనీ, ఈ క్రమంలో ఓ బాంబు పేలుడు సంభవించిందనీ, ఓ అధికారి గాయపడ్డారని, పెట్రోల్ కార్ డ్యామేజ్ అయ్యిందని అధికారులు వివరించారు. గాయపడ్డ పోలీసు అధికారిని, మిగతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 8 ఫైర్ బాంబులు, 22 బాటిల్స్ (మోలోటోవ్ కాక్టెయిల్స్ కోసం వినియోగించేవి) స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







