రెండు డయాబెటిస్ మెడిసిన్స్ మార్కెట్ నుంచి ఉపసంహరణ
- July 23, 2018
మార్కెట్ నుంచి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే రెండు రకాలైన మందుల్ని ఉపసంహరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులెవరూ ఆ మందుల్ని వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. గ్లైనేజ్ 5 ఎంజీ, అలాగే డయాటాబ్ 5 ఎంజీ ట్యాబ్లెట్లపై నిషేధం వుంది. హెల్త్ కన్సర్న్స్ నేపథ్యంలో వీటిపై నిషేధం విదించారు. టైప్ 2 డయాబెటిస్కి ఈ మందుల్ని ఇప్పటిదాకా వినియోగించారు. ఈ మందు తాలూకు కంపోజిషన్పై వివాదాలు వచ్చాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఇటీవలే ఈ ప్రోడక్ట్ని మార్కెట్ నుంచి ఉపసంహరించడంతోపాటు, వినియోగదారులనూ ఈ మందులు కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. నేషనల్ హెల్త్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ తాజాగా ఈ మందులపై నిషేధం ప్రకటించింది. నిషేధించిన మందుల్ని ఎవరైనా విక్రయిస్తున్నట్లయితే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







