సౌదీ అరేబియా ఎన్నికల్లో తొలిసారిగా పట్టం కట్టిన మహిళలు
- December 13, 2015
సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. మక్కాలోని మద్రాకా కౌన్సిల్లో సల్మా బింట్ హిజాబ్ అల్ ఒటెబీ అనే మహిళా అభ్యర్థి విజయం సాధించినట్లు బంగ్లా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ స్థానంలో మొత్తం ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు పోటీపడగా.. సల్మా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 284 సీట్లకుగానూ.. 6వేల మంది పురుషులు, 900మంది మహిళలు పోటీపడ్డారు. తల నుంచి పాదాల వరకు మహిళలు పూర్తిగా వస్త్రంతో కప్పుకోవాలనే కఠిన నిబంధనలున్న సౌదీ అరేబియాలో తొలిసారిగా మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడమేగాక, తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. అయితే ఎన్నో నిబంధనల మధ్య ఈ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచారంలో మహిళా అభ్యర్థులు పురుష ఓటర్లను ఓట్లు అడగరాదనే నిబంధన ఉంది. అంతేగాక, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







