యాచక వృత్తిని వదిలేస్తే ఉపాధి
- July 24, 2018
హైదరాబాద్: ఆనందాశ్రమంలో ఉన్న యాచకులు మళ్లీ యాచకం జోలికి వెళ్లకుండా సమాజంలో గౌరవంగా జీవించాలని దానికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని సెట్విన్ చైర్మన్ ఇనాయత్ అలీ బాక్రీ అన్నారు. మంగళవారం చంచల్గూడ జైలులో ఉన్న ఆనందాశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఆశ్రమంలో యాచకులకు అందిస్తున్న సేవలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగులకు ఫోన్ షాపు, ఇతరులకు బైండింగ్, సెక్యూరిటీ గార్డు, వెల్డింగ్ పనులు తదితర వాటిలో శిక్షణ ఇప్పించి వారి జీవనోపాధికి ఏర్పాట్లు చేస్తామన్నారు. యాచక వృత్తిని వదిలేసి నేరుగా తనను కలిస్తే ఎదైనా ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. యాచక వృత్తికి దూరంగా వుండాలని, సమాజంలో గౌరవంగా జీవించటానికి వచ్చేవారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, జైలు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







