మలేషియా:తెలంగాణ ప్రవాసుల కోసం హెల్ప్ లైన్
- July 26, 2018
కౌలాలంపూర్ : మలేషియాలోని కౌలాలంపూర్ బ్రిక్ ఫీల్డ్స్ పామ్ కోర్ట్ హాల్లో మలేషియా తెలంగాణ రాష్ట్రీయ సమితి ఆధ్వర్యంలో మంత్రి కల్వకుంట్ల తారక రామా రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మలేషియా టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బీగాల సలహా మేరకు హెల్ప్ లైన్ను (006010-778 1103) ప్రారంభించారు. మలేషియా ప్రవాసీ తెలంగాణ వాసులు ఎదురుకొంటున్న సమస్యలను ఈ హెల్ప్ లైన్ ద్వారా తెలియజేయాలని వైస్ ప్రెసిడెంట్ కుర్మా మారుతీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు చిట్టిబాబు చిరుత, వైస్ ప్రెసిడెంట్ మారుతీ కుర్మ, జనరల్ సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, ఇతర కోర్ కమిటీ సభ్యులు బొడ్డు తిరుపతి, గౌరు రమేష్, బోయేని శ్రీనివాస్, గద్దె జీవన్ కుమార్, నడిపెళ్లి సత్యనారాయణరావు, మునిగల అరుణ్ కుమార్, రవీందర్ రెడ్డి తెరాస సభ్యులు రసూల్, సంతోష్, హరీష్ , కోటి, మహిళా సభ్యులు రజిత, స్వాతి, శాన్విత, స్వప్న, సౌజన్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







