'స్త్రీ' ట్రైలర్ విడుదల
- July 27, 2018
శ్రద్ధా కపూర్..'స్త్రీ' ట్రైలర్ విడుదల ముంబయి: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'స్త్రీ'. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్కుమార్ రావ్ కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఒక ఊరిలో ఉన్నట్టుండి మగవాళ్లంతా మాయమైపోతుంటారు. వారు కన్పించకుండాపోయిన ప్రదేశంలో దుస్తులు లభ్యమవుతుంటాయి. తీరా చూస్తే వారిని కిడ్నాప్ చేస్తోంది ఒక స్త్రీ అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందరికీ ఓ యువతిపై అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె కేవలం ఊర్లో జరిగే పండుగల సమయంలోనే కన్పిస్తుంటుంది. మిగతా సమయాల్లో ఎవ్వరికీ కన్పించదు. ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమెకు ఏం కావాలి? అన్నదే కథ.
ఇందులో స్త్రీ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించారు. హార్రర్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రీకరణ మొత్తం మధ్యప్రదేశ్లోని చందేరీ ప్రాంతంలో జరిగింది. ఆగస్టు 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాతో పాటు శ్రద్ధా తెలుగులో 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క హిందీలో 'బత్తి గుల్ మీటర్ చాలూ', ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్లోనూ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







