రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటి

- July 27, 2018 , by Maagulf
రష్యా అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటి

బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పర్యటనకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటి అయ్యారు. రష్యాతో మాకు మంచి అనుబంధం ఉంది. విభిన్న రంగాల్లో మా స్నేహం కొనసాగుతుంది. బహుళ రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాము అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ఇరు దేశాల నేతల ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, శక్తి, రక్షణ మరియు పర్యాటక రంగం వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు విదేశాంగ ప్రతినిధి రావీష్‌ కూమార్‌ ట్విటర్‌లో తెలిపారు. కాగా ప్రపంచ జనాభాలో 40 శాతం ఉన్న బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు పరస్పర సహాకారం కొరకు 2009లో బ్రిక్స్‌ గా ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిక్స్‌ పదో శిఖరాగ్ర సమావేశాలకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నగరం ఆతిథ్యం ఇస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com