ఎన్ఆర్ఐల సమన్లు కోసం ప్రత్యేక పోర్టల్:సుష్మా స్వరాజ్
- July 27, 2018
న్యూ ఢిల్లీ:భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్ఆర్ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్ చేస్తామని అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. పోర్టల్ అభివృద్ధి చేసేందుకు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనకు న్యాయ శాఖ, హోం శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు అంగీకరించాయని సుష్మ స్వరాజ్ అన్నారు.
ఎన్నారై భర్తలు వారి భార్యలను వదిలేసి పారిపోవడాన్ని, పెళ్లి చేసుకున్న తర్వాత శారీరకంగా, మానసికంగా వారిని హింసించడాన్ని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత మూడేళ్లలో 2015 జనవరి నుంచి 2017 నవంబరు వరకు ఎన్నారై భర్తల వేధింపులు, వదిలేసి వెళ్లడానికి సంబంధించి మహిళల నుంచి 3,328 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. పోర్టల్ తీసుకురావడానికి చేయాల్సిన మార్పులను కేబినెట్లో చర్చిస్తామని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించేలా ప్రయత్నిస్తామని సుష్మ వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







