యూకేలో ఉద్యోగమంటూ.. ఘరానా మోసం
- July 27, 2018
హైదరాబాద్ : యూకే ప్రిన్స్సెస్ రాయల్ యూనివర్సిటీ దవాఖానలో ఉద్యోగమంటూ నమ్మించి... ఓ యువతికి సైబర్చీటర్లు రూ. 1.75 లక్షల వరకు టోకరా వేశారు. సికింద్రాబాద్, న్యూమెట్టుగూడకు చెందిన వినీతకు ప్రిన్స్సెస్ యూనివర్సిటీలో జాబ్ ఇస్తున్నట్లు ఆన్లైన్లో సమాచారం అందింది, దానికి సంబంధించిన హెచ్ఆర్ హెడ్ మోర్గెయిన్ క్లీన్ పేరుతో అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. మూడేండ్ల బాండు, నెలకు 4500 పౌండ్ల జీతంతో నీకు ఉద్యోగం ఇస్తున్నామంటూ ఒప్పంద పత్రాలు పంపించారు. ఆ తరువాత మీ మెయిల్ను బ్రిటీష్ హైకమిషన్ ఎంబసీ, ఢిల్లీకి వీసా ప్రాసెసింగ్ నిమిత్తం పంపిస్తున్నామని, అక్కడ గ్రహామ్ మెర్టన్ మీతో మాట్లాడుతాడంటూ నమ్మించారు. ఆ తరువాత యూకే వీసా ప్రాసెసింగ్ కోసం రూ. 29,900 పంపించారు. ఈ సందర్భంగా హైకమిషన్ ఆఫీస్ పేరుతో చెల్లించిన డబ్బుకు సంబంధించిన రశీదులు పంపించారు. ఆ తరువాత మీకు ఐఈఎల్టీఎస్ సర్టిఫికెట్ ఉంటేనే, వీసా వస్తుందని, అది తప్పనిసరి అంటూ భయపెట్టించారు. తన వద్ద సర్టిఫికెట్ లేదని చెప్పడంతో, మేం సర్టిఫికెట్ ఇప్పిస్తాం అందుకు రూ.
60 వేలు చెల్లించాలనగా... ఆ డబ్బును చెల్లించింది. అనంతరం రూ. 89, 707 బీటీఏ(బేసిక్ ట్రావెల్ అలవెన్స్స్) చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఈ డబ్బు చెల్లిస్తేనే ఢిల్లీలోని యూకే ఎంబీసీలోకి వెళ్లేందుకు గేట్పాస్ లభిస్తుందంటూ భయపెట్టించారు.
దీంతో బాధితురాలు బజాజ్ ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకొని డబ్బు చెల్లించింది. ఈ తరువాత తిరిగి డబ్బులు అడుగుతుండడంతో ఢిల్లీలోని యూకే ఎంబీసీకి ఫోన్చేసి ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారు ఎవరు లేరని, అదంతా మోసమని వారు నిర్థారించారు. దీంతో బాధితురాలు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







